పశుపతినాథ్---ఖాట్మండు
పశుపతినాథ్---ఖాట్మండు భట్టిప్రోలు విజయలక్ష్మి నేపాల్ మేము రెండు సార్లు చూసాం. 1993 లో ఒకసారి, 2018 లో ఒకసారి. 1993 లో వెళ్ళినప్పుడు మాతో మా పిల్లలు, మా అమ్మానాన్నా, మా పెద్ద చెల్లెలు, మరిది, వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. మొత్తం పదిమంది. మా అమ్మకి బుద్ధుడంటే చాలా ఇష్టం. లుంబిని చూడాలని అడిగింది. అప్పుడు మేము బొకారోలో ఉండేవాళ్ళం. అందరం గోరఖ్ పూర్ లో కలుసుకున్నాం. అక్కడ గోరక్షానాథుడి మందిరానికి వెళ్లాం. మానాన్న మమ్మల్నందరినీ గీతాప్రెస్ కి కూడా తీసుకెళ్లాడు. ఆ తరువాత అందరం లుంబిని వెళ్లి అక్కడ బుద్ధుడు జన్మించిన స్థలం చూసాం. మాయాదేవి ఒక తటాకం ఒడ్డున చెట్టు కొమ్మని పుచ్చుకుని నుంచుని బుద్ధుడిని కంటుంది. ఆ దృశ్యం అక్కడి శిల్పాల ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు ఆ తటాకం అంతా ఎండిపోయి వుంది. అక్కడ గైడ్ 'ఆరోజుల...