పోస్ట్‌లు

జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పరమాచార్యుల ప్రసన్నదృష్టి

చిత్రం
పరమాచార్యుల ప్రసన్నదృష్టి  భట్టిప్రోలు విజయలక్ష్మి                                                       స్వాములవార్లు వచ్చేరోజుకి ఒక రోజు ముందరే అందరం ఆరుగొలను చేరుకున్నాం. ఇటు నందివాడ కుటుంబం నుంచీ, అటు నండూరి కుటుంబం నుంచీ దాదాపు అందరూ వచ్చారు. స్వాములవారికి  పూర్ణకుంభంతో  స్వాగతం చెప్పారు అమ్మా, నాన్నా. స్వాములవారితో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది కూడా వచ్చారు.  బళ్ళూ, ఎడ్లూ, వాటిని నడిపే వాళ్ళూ, పల్లకీ, దాన్ని మోసే బోయీలూ, ఒక ఏనుగూ, దాని మావటీ వచ్చారు. వీళ్ళే కాక, వేదపండితులూ, పూజారులూ, సేవకులూ, వంట బ్రాహ్మణులూ, వీళ్లంతా కూడా వచ్చారు. ఇంతమందికీ నాన్నా వాళ్ళ ఇల్లే విడిది. దాన్నే మేము ఓ నెల క్రితం బాగు చేయించింది. సుమారు ఓ 50, 60 మంది అక్కడ దిగారు. స్వామివారు వస్తూనే పీఠం పెట్టారు. స్వాములవారికి ఊరు ఊరంతా బ్రహ్మరథం పట్టింది. పది రోజులు ఉన్నారు ఆరుగొలనులో పీఠంతో సహా స్వామీజీ. ఆ పది రోజులు ఊరంతా జాతరే ...

ఆరుగొలను ఇల్లు సిద్ధం

చిత్రం
ఆరుగొలను ఇల్లు సిద్ధం   భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                                                                                 నాన్న ప్లానింగ్ అంతా పకడ్బందీగా చేసాడు ఎవరికీ, ఏ ఇబ్బందీ రాకుండా. బామ్మ పెద్దదయిపోయింది కనుక, ఓపిక తక్కువ, అందుకని వంట చేసిపెట్టటానికి ఒక వంట మనిషి, బహుశా ఆవిడ పేరు కమలమ్మ అనుకుంటా, పని సాయానికి ఒక పనివాడు, కోటేశ్వరరావు, స్కూల్లో కాంట్రాక్టు పనివాడు. ఈ ఇద్దరూ బామ్మకి సహాయంగా వచ్చే ఏర్పాటు చేశాడు. ఆ పైన అతి ముఖ్యంగా బామ్మకి తోకగా నేను. మా టీంకి బామ్మ కాప్టెన్. నలుగురం కలిసి ఒక మూడు వారాలలో ఇల్లు మొత్తం స్వాములవార్లకి, వారి పీఠానికీ, సిబ్బందికీ ఏ ఇబ్బంది లేకుండా సిద్ధం చేయించటం మా టాస్క్. అ...

కంచి పీఠంతో సాంగత్యం

చిత్రం
కంచి పీఠంతో సాంగత్యం    భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                    తెనాలి తాలూకా హైస్కూల్ తో చక్కని అనుబంధం ఉన్న మరొక అద్వైత పీఠం కంచి కామకోటి పీఠం. ఈ పీఠం కూడా దాదాపు ప్రతి సంవత్సరం వచ్చి స్కూల్లో విడిది చేసి, వచ్చే భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తూ ప్రవచనాలు ఇచ్చేవారు. ఈ పీఠానికి అధిపతి ఆ రోజుల్లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, ఈయన్నే పెద్దస్వామి అని ఆ రోజుల్లో అనేవారు. ఆ తరువాత ఈ స్వామినే పరమాచార్య అని పిలిచేవారు. ఈ పీఠానికి ఆ రోజుల్లోనే మరొక చిన్నస్వామి కూడా ఉండేవారు. వారే శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి. జయేంద్రులు కామకోటి పీఠానికి భావి పీఠాధిపతి. ఆ తరువాత రోజుల్లో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామిని కూడా పరమాచార్యుల తరువాత మూడవ వారసునిగా ప్రకటించారు. సన్యాసదీక్ష తీసుకున్న తొలి రోజుల్లో ఈ విజయేంద్రులను చూడటం జరిగింది. బహుశా అప్పుడు అయన ఏడు, ఎన...

శృంగేరి పీఠంతో నాన్న అనుబంధం

చిత్రం
శృంగేరి పీఠంతో నాన్న అనుబంధం    భట్టిప్రోలు విజయలక్ష్మి                                                        శృంగేరి పీఠం జగద్గురు ఆది శంకరాచార్యచే  స్థాపించబడిన పీఠం. తన శిష్యుడైన సురేశ్వరాచార్యుడిని (మండన మిశ్రుడు) పీఠాధిపతిని చేసి, ఈ పీఠాన్ని దక్షిణామ్నాయ పీఠంగా స్థాపించాడు. ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న అన్ని అద్వైత పీఠాలూ ఈ శృంగేరి పీఠం కిందే పనిచేస్తాయి. మేము తెనాలిలో ఉండే రోజుల్లో శృంగేరి పీఠాధిపతి, శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వారు దాదాపు ప్రతి సంవత్సరం మా స్కూలుకి వచ్చేవారు. ఒక సంవత్సరం చాతుర్మాస్య వ్రతం కూడా చేసారు. స్కూల్ కార్యక్రమాలకి అడ్డంకి రాకుండా ఈ స్వాములవార్ల కార్యక్రమాలు జరిగేవి. మా నాన్నగారు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడే శృంగేరి స్వాములవారు చెప్పారు, ఇది విద్యాలయం కనుక స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం ఉంటే బావుంటుందని, తప్పక పెట్టాలని చెప్పారు. దాంతో నాన్న స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ అనుమతితో, జైపూర్...

కుర్తాళం, పుష్పగిరి, గాయత్రి పీఠాలతో నాన్న

చిత్రం
 కుర్తాళం, పుష్పగిరి, గాయత్రి  పీఠాలతో నాన్న      భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                         అలాగే మా ఇంట్లో పీఠం తొలిసారిగా పెట్టిన వారు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమ రామానంద భారతీ స్వామి. అమ్మా, నాన్నా ఆయనకు పాదపూజ చేసి బిక్ష పెట్టినప్పుడు, అదో పండుగలా ఉండేది. స్కూల్ స్కూలంతా తరలి వచ్చేవారు. ఆ రోజు సుమారు ఓ వందమంది పైగా భోజనం చేసేవారు. స్కూల్లో ఉండే బ్రాహ్మణ ఉద్యోగులు వచ్చి  భోజనాలు వడ్డించేవారు.  వండిన వంటలు సరిపోకపోతే నెమ్మదిగా కూర్చోండి, అనేవారు. అదో సిగ్నల్ అందరికీ, ఏదో వంటకమో, అన్నమో అయిపోయింది, మళ్ళీ వండుతున్నారు, కాస్త నెమ్మదిగా తినండి అది వచ్చేదాకా అని చెప్పటం. ఉన్నట్టుండి, "భోజనకాల సమయే, గోవిందా నామ స్మరణా.." అని ఎవరో ఒకరు గట్టిగా అరచి, గోవిందా, గోవిందా అనేవారు. దాంతో అన్ని గదుల్లో భ...

నాన్నా - స్వామీజీలతో సాన్నిహిత్యం

చిత్రం
నాన్నా - స్వామీజీలతో సాన్నిహిత్యం   భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                                                                         మా నాన్న తెనాలి వచ్చేదాకా మనిషి వేరు. తెనాలి వచ్చాక మారిపోయాడు. అప్పటి వరకూ స్వామీజీలు, పీఠాధిపతులూ, సన్యాసులూ వీరికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు. తెనాలి వచ్చాక వీళ్ళందరూ మా దైనందిన జీవితంలో దాదాపు ఒక భాగమై పోయారు. త్రివిక్రమ రామానంద భారతీ స్వామి అప్పట్లో కుర్తాళం పీఠానికి అధిపతి. వారు ముందరే మా కుటుంబానికి పరిచయం ఉన్నందున, ఒకసారి తన పీఠంతో సహా మా ఇంటికి తెనాలి వచ్చారు. మా ఇంటి వసారాలోనే (అది చాలా పెద్దది) పీఠం పెట్టారు. అక్కడ నిత్యపూజలు జరిగేవి.  స్వామివార్లందరినీ స్వాములవారు లేదా స్వాములారు ...

సంబరంగా ఆరాధనలు, ఆబ్దీకాలు

సంబరంగా ఆరాధనలు,  ఆబ్దీకాలు   భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                                                                  ఇక మా ఉమా పెదనాన్నా వాళ్ళ ఇంట్లో ఎంతో సంబరంగా జరిగే ఆరాధనలు, ఆబ్దీకాలు గురించి చెప్తా. సంబరాలేంటి, ఆరాధనలేంటి, ఆబ్దీకాలేంటి అనుకుంటున్నారా. మా పిల్లలకి అవన్నీ పెద్ద సంబరాలు. పెద్దలకీ అంతేననుకోండి. ఎందుకంటే మా ఫామిలీలో ఒక అన్ రిటెన్ రూల్ ఏమంటే, ఏదో మరో పెద్ద ఇబ్బంది ఉంటే తప్ప ఈ కార్యక్రమాలకి ఎవరూ మిస్ కాకూడదని. సుమారు 20, 25 మంది చిన్నపిల్లలు, ఓ 10, 15 మంది పెద్ద పిల్లలు, మరో 20 మంది దాకా పెద్దలు, ఇంతమంది ఒక్కసారి, ఒక్కచోట కలుసుకునే అవకాశాలు సంవత్సరానికి ఆ రెండే. మొదటిది మా తాతగారు స్వర్గీయ ఆనందరామయ్య గారి ఆరాధన, ఆబ్దీకం, రెం...

బామ్మ-నిష్క్రమణం

బామ్మ-నిష్క్రమణం                       భట్టిప్రోలు విజయలక్ష్మి                                                                         అప్పటికి ఉమా పెదనాన్న ఇంటి నుంచి బామ్మ మా ఇంటికి వచ్చి మూడు వారాలు. ఈ మూడు వారాలు ఇంట్లో అందరికీ ఏదో ఒక రకంగా తన చాదస్తం, పెంకితనంతో చుక్కలు చూపించింది. వాటిల్లో ఒకటి నా చేతిలో మందులు లాక్కుని తనే పొరపాటున ఒక మందుకు బదులు ఇంకో మందు వేసుకుని చేసిన హడావుడి. పాపం అప్పటికప్పుడు సరోజినత్తయ్య బందరు నించి వాళ్ళ అమ్మకి ఏమైపోతుందో అని పరిగెత్తుకు వచ్చింది కూడాను. ఒకరోజు 'లీలా,నాకు ఓపిక లేదే, స్నానం చెయ్యలేను, స్నానం చెయ్యకుండా, మడి కట్టుకోకుండా అన్నం తినలేను, ఎలా' అన్నది. అచ్చం బైజూబావరా సినిమాలో స్వామి హరిదాస్ లాగా. అమ్మేమో అప్పుడు పాపం మడి కట్టుకుని ఉన్నది. వెంటనే ఓపికకు ఓ గ్లాసుడు హార్లిక్స్ కలిపి ఇచ్చింది. బామ్మకి కొ...

బామ్మ-మార్గదర్శి-ఓ కొసరు కథనం

బామ్మ-మార్గదర్శి-ఓ కొసరు కథనం    భట్టిప్రోలు విజయలక్ష్మి                                              బామ్మలో ఉన్న మరో గొప్పదనం ఏమిటంటే, ఏం చేసినా, ఇది నా బాధ్యత అనుకుని చేసేది. నేను కనుక ఇది చేసాను ఇలా చేసాను అన్నట్టు ఎప్పుడూ కనపడేది కాదు. ఇది నా బాధ్యత, నేను చెయ్యాలి. నా ధర్మం అన్నట్టే ఉండేది. ఏనాడూ భర్త గురించి కానీ, నిత్యం ఇంట్లోనే ఉండే బాల వితంతువైన ఆడపడుచు గురించి కానీ ఒక్క కంప్లైంట్ కూడా చెప్పలేదు. ఏమి చేసినా తాతగారి మాట కాదని, అతిక్రమించి చెయ్యలేదు. పెళ్ళిలో తాతగారే, "నాతిచరామి, (న అతి చరామి)", అని ప్రమాణం చేసినా, బామ్మ కూడా ఎప్పుడూ తాతగారి విషయంలో ఈ "న అతి చరామి" అనే సూత్రాన్నే పాటించింది. అంటే నిన్ను దాటి, నిన్ను కాదని నేను అతిగా చరించను అని చెప్పటం. పెళ్లి ప్రమాణంలో తాతగారు నోటితో చెప్తే, కార్యరూపంలో బామ్మ చేసి చూపించింది. పెళ్ళిలో వరుడు ధర్మేచ, అర్ధేచ, కామేచ నాతి చరామి అని ప్రమాణం చేస్తాడు. అంటే భర్త భార్యకి వాగ్...